అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ లో పార్టీ ఆఫీసులో రాష్ట్ర చైర్మన్ జావేద్ లతీఫ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలపై అనేక విషయాలు వివరించారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని అన్నారు. రాష్టంలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలు పోరాటాలు నిర్వహించాలని అన్నారు. రాబోయో స్థానికి సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాపితంగా అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు.సమావేశం ప్రారంభం ముందే
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిలో అమాయక టూరిస్ట్ లు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికీ AIFB రాష్ట్ర కమిటీ 2 నిమిషాలు మౌనం పాటించి.. నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా నుండి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, , బండారి శేఖర్ ,కార్యదర్శి అజిత్ రావు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అన్ని జిల్లాల AIFB కార్యదర్శులు పాల్గొన్నారు.