Allindiaforwardbloc.com

Categories
Photos

AIFB 86 వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

పార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆవిర్బవా వేడుకలు జయప్రదం చేయాలి

మహనీయులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జూన్ 22 1940 వ సంవత్సరంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB)ని స్థాపించి జూన్ -22 నాటికీ  85 వసంతాలు పూర్తి చేసుకుని 86 వ సంవత్సరంలో అడుగిడుతున్న సంధర్భంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లొ 86 వ వార్షికోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. జూన్ -22 న రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఆవిర్బవా వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జవెద్ లతీఫ్ మరియురాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ పాల్గొన్నారు.

Categories
Articles

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి- బండ సురేందర్ రెడ్డి

అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ లో పార్టీ ఆఫీసులో రాష్ట్ర చైర్మన్ జావేద్ లతీఫ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలపై అనేక విషయాలు వివరించారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని అన్నారు. రాష్టంలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలు పోరాటాలు నిర్వహించాలని అన్నారు. రాబోయో స్థానికి సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాపితంగా అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు.సమావేశం ప్రారంభం ముందే
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిలో అమాయక టూరిస్ట్ లు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికీ AIFB రాష్ట్ర కమిటీ 2 నిమిషాలు మౌనం పాటించి.. నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా నుండి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, , బండారి శేఖర్ ,కార్యదర్శి అజిత్ రావు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అన్ని జిల్లాల AIFB  కార్యదర్శులు పాల్గొన్నారు.

Categories
Songs Videos

AIFB మొదటి కాన్ఫరెన్స్

1940 జూన్ 20–22 న, ఫార్వర్డ్ బ్లాక్ తన మొదటి అఖిల భారత సమావేశాన్ని నాగపూర్‌లో నిర్వహించింది. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్‌ను సామ్యవాద రాజకీయ పార్టీగా ప్రకటించారు. జూన్ 22 ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వ్యవస్థాపక తేదీగా తీసుకున్నారు. బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కోసం మిలిటెంట్ చర్యను కోరుతూ ‘అధికారమంతా భారతీయులకే’ అనే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది. పార్టీ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోసు, ప్రధాన కార్యదర్శిగా హెచ్‌వి కామత్ ఎన్నికయ్యారు